Sunday, November 15, 2009

భగవంతుడికి కోపం ఎందుకు వస్తుంది? కామ క్రోధాలు ఉన్నచో అతడు భగవంతుడెందుకు అవుతాడు?

భగవంతుడికి కోపం ఎందుకు వస్తుంది? కామ క్రోధాలు ఉన్నచో అతడు భగవంతుడెందుకు అవుతాడు? అని అప్పుడప్పుడూ పూజల సందర్భంలో కొందరు ప్రశ్నిస్తుంటారు.

వాటికి నేను ఇలా సమాధానం ఇస్తుంటాను. భగవంతుడికి కోపం వస్తుంది. అది అందరి కోపం వంటిది కాదు. మనం తప్పు చేసినప్పుడు ఆయనకు కోపం కలుగుతుంది. అది అమ్మకు తన బిడ్డ ( తప్పు చేసినప్పుడు అతని ) మీద కలిగేటటువంటి కోపం. తన బిడ్డ తప్పుచేయగానే అతను మరోసారి అలా చేయకుండా ఉండేందుకు, అతనిని సక్రమ మార్గంలో నడిపేందుకు ఆ తల్లి తన బిడ్డను ( తెచ్చిపెట్టుకున్న ) కోపంతో దండిస్తుంది. అది నిజమైన కోపం కాదు. తెచ్చిపెట్టుకున్న కోపం. అంటే కోపం వచ్చినట్లుగా అతన్ని భ్రమింపచేసి, తద్వారా అటుల మరల తప్పు చేయకూడదు అని తెలియజేయుటే ఆమె లక్ష్యం. అది ఎక్కువ కాలం ఉండే కోపం కాదు. ఎంత తొందరగా వస్తుందో అంత తొందరగా మాయమవుతుంది.

అది ఎప్పుడు మాయమవుతుంది?

ఆ బిడ్డ తల్లి కొట్టగానే అమ్మా! అంటూ ఏడుస్తాడు. తన బిడ్డ నోటి నుండి ఎప్పుడైతే తన కోసమైన ఆర్తి తో కూడిన పిలుపు వినిపిస్తుందో ఆ క్షణాన్నే ఆమె కోపం మాయమై ఆ స్థానంలో ప్రేమపొంగుకొస్తుంది.

” అయ్యో! కన్నా! గట్టిగా తగిలిందా నాన్నా!? ఇంకెప్పుడూ కొట్టనులే. ఎందుకురా నాన్నా నాకు కోపంతెప్పిస్తావు? మరోసారి ఇలాచెయ్యకే మరీ? ”
అంటూ అతన్ని ప్రేమతో లాలించి బాధను మరిపిస్తుంది.

సరిగ్గా అటువంటిదే భగవంతుని కోపం కూడా. మనం తప్పు చేసినప్పుడు, మనల్ని సక్రమ మార్గంలో పెట్టడానికి అతను కోపాన్ని నటిస్తాడు. అది శాశ్వతమైన కోపం కాదు. ఎల్ల కాలమూ ఉండ బోదు. ఎప్పుడైతే మనం మన కొచ్చిన బాధలకు/ కష్టాలకు తాళలేక అతని శరణు ఆర్తితో అర్థిస్తామో ఆక్షణమే అతని కోపాన్ని ఉపశమించి, ప్రేమను కురిపిస్తాడు.

మళ్లీ ఇక్కడ ఇంకో ప్రశ్న వస్తుంది.

భగవంతుడు అందరినీ సక్రమ మార్గంలో నడిపేటప్పుడు ఇందరు అవినీతి పరులు ఎలా పుట్టుకు వస్తున్నారు? భగవంతుడు వారందిరినీ సరిదిద్దడేమి?

అలా అర్థించిన ప్రతీ ఒక్కరి కష్టాలు తీరే టట్లైతే ఇందరికి ఇన్ని విధాలైన కష్టాలు ఎందుకు కలుగుతున్నాయి? వారి బాధలు తొలగిపోవేమి? అని


భగవంతుడు అందరినీ సక్రమ మార్గంలో నడిపేందుకే ఉన్నాడు. తల్లి తన అందరు బిడ్డలనూ ఒకే విధంగా చూస్తుంది. ఒకరిని ఒకలా, వేరొకరిని మరోలా చూడాదు. అందరూ మంచి మార్గంలోనే నడావాలని కోరుకొంటుంది. అందువల్లనే తప్పుచేసిన అందరినీ దండిస్తుంది. కానీ అందరూ తమను దండించింన వెంటనే ఆమెను శరణు వేడరు. ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందిస్తారు. ఒకరు ఆమెనుండి దూరంగా ఉండడం ప్రారంభించవచ్చు ( భగవంతుడి వల్ల తమకు జీవితంలో ఎన్నో దెబ్బలు తగిలాయని అతని పూజించడం మానిన భక్తుల వలే ), వేరొకరు ఆమెను మోసం చేయడానికి అంటే ఆమె సమక్షంలో ఒకలా, పరోక్షంలో మరోలా ప్రవర్తించడానికి ప్రయత్నించ వచ్చు ( రోజూ గుడిలో పూజలు చేస్తూ, బయటకు రాగానే ఇతరులను మోసంచేస్తూ ఉండే భక్తుల వలే )

కానీ ఏ కొడుకు ఎలా ప్రవర్తించాడో దానికి తగిన విధంగా స్పందిస్తుంది తల్లి. అమ్మా అని అర్థించిన వాడిని అక్కున చేర్చిన ఆ తల్లే , తననుండి దూరమవ్వడానికి యత్నించే కొడుకు విషయంలో , మోసంచెయ్యడానికి యత్నించే కొడుకు విషయంలో వేరు వేరు విధాలు గా స్పందిస్తుంది. ఏది ఏమైనా ఆమె అంతిమ లక్ష్యం తన బిడ్డను సక్రమ మార్గంలో పెట్టడమే. విద్య ఒక్కటే అయినా అది నేర్చుకునే పిల్లవాడిని బట్టి దాన్ని వేరు వేరు విధాలుగా నేర్పుతాడు గురువు.

సరిగ్గ అదే విధంగా భగవంతుడు కూడా మనందరినీ సమానంగానే చూస్తున్నప్పటికీ, మన ఙ్ఞానాన్ని బట్టి మనకు వేరు వేరు విధాలైన పరీక్షలు పెట్టి మనల్ని సన్మార్గంలో నడిపిస్తుంటాడు.

అంటే భగవంతుడు మనల్ని చూసే విధానంలొ ఎటువంటి తేడాను లేదు. ఆ భగవంతుడి చర్యలను మనం స్వీకరించే విధానంలోనే ఉంది ఈ తేడా అంతా. ఒకడుతనకు కించిత్ ఆపద కలుగ గానే భగవంతుడిని శరణు వేడితే, మరొకడు తన తలకు ఎన్ని బొప్పిలు కట్టినా ఆభగవంతుడి మహిమను గుర్తించి, అతని శరణు వేడడానికి త్వరపడడు. అయినప్పటికీ ఆ భగంవతుడు వేరు వేరు పధ్ధతులలో అతనిని అనుగ్రహిస్తాడు.

Friday, November 6, 2009

శ్రీ రామచంద్ర హారతి పాట

నాకు చాలా ఇష్టమైన పాటల్లో ఇదొకటి. ఇది నాకే కాదు చాలా మందికి ఇష్టం. నాదగ్గర పాట ఉన్న పుస్తకాలు దాదాపు ఇరవై వరకూ ఉండాలి. అవన్నీ అందరూ తీసుకుపోగ చివరికి ఒకపుస్తకం మిగిలింది. అదికూడా జీర్ణమైపోతుండడం వల్ల దాన్ని ఇక్కడ భద్ర పరుచుకుంటున్నాను. ఇది మరెవరికైనా ఉపయోగపడితే మరింత సంతోషం.

శ్రీ రామచంద్ర హారతి పాట






రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ
మామకాభీష్టదాయ మహిత మంగళం

కౌసలేశాయ మందహాసదాస పోషకాయ
వాసవాది వినుత సద్వరద మంగళం

చారు కుంకుమోపేత చందనాగరు చర్చితాయ
హార కటక శోభితాయ భూరి మంగళం

లలిత రత్న కుండలాయ తులసీవనమాలికాయ
జలజ సదృశదేహాయ చారు మంగళం

దేవకీ సుపుత్రాయ దేవదేవోత్తమాయ
భావజాగురువరాయ భవ్యమంగళం

పుండరీకాక్షాయ పూర్ణ చంద్ర వదనాయ
అండజా వాహనాయ అతులమంగళం

విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ
సుముఖ చిత్త కామితాయ సుభద మంగళం

రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ
స్వామి భద్రగిరివరాయ సర్వ మంగళం

భద్రాద్రి క్షేత్రవాస, నారాయణ దాసపోష
నవ్య నీరద ఘనశ్యామ దివ్య మంగళం

మంగళం కోలేంద్రాయ మహనీయ గుణాత్మనే
చక్రవతి తనూజాయ సార్వ భౌమాయ మంగళం.

Thursday, November 5, 2009

వివిధ సందర్భాలలో పఠించదగు శ్లోకములు

ఉదయం నిద్ర లేచిన వెంటనే పఠించు ధ్యానము:

బ్రహ్మమురారి త్రిపురాంతకారీ భానుశ్శశిః భూమిసుతో బుధశ్చ
గురుశ్చ శుక్రశ్శని రాహుకేతవః కుర్వంతు సర్వే మమ సుప్రభాతం.

విష్ణుశక్తి సముత్పన్నే చిత్రవర్ణ మహీతలే
అనేకరత్న సంపన్నే పాదఘాత క్షమా భవ.

కరాగ్రే వసతే లక్ష్మీః కర మధ్యే సరస్వతీ
కరమూలేతు గోవిందః ప్రభాతే కర దర్శనం.

సముద్ర వసనే దేవి పర్వత స్తనమండితే
విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్యమే.

స్నానము చేయునపుడు పఠించవలసినవి:

గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు.

ఆవాహయామి త్వాం దేవి స్నానార్థమిహ సుందరి
ఏహి గంగే నమస్తుభ్యం సర్వతీర్థ సమన్వితే.

పుష్కరాద్యాని తీర్థాని గంగాద్యా సరిత స్తథా
ఆగచ్ఛంతు మహాభాగా స్నానకాలే సదా మమ.

అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతో2పివా
యః స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశ్శుచిః

పుండరీకాక్ష! పుండరీకాక్ష! పుండరీకాక్ష!

గణపతి ప్రార్ధన:

శుక్లాంబరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం.
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే.

పార్వతీ పరమేశ్వర ప్రార్థన:





వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థః ప్రతిపత్తయే.
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ.

గురు ప్రార్థన:

గురు బ్రహ్మ గురు విష్ణుః గురుర్దేవో మహేశ్వరః.
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

ధ్యాన మూలం గురోర్మూర్తిః పూజా మూలం గురోః పదం
మంత్ర మూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా.

సరస్వతీ ప్రార్థన:

సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమేసదా.

పద్మ పత్ర విశాలాక్షి పద్మ కేశరవర్ణనీ
నిత్యం పద్మాలయాం దేవి సామాంపాతు
సరస్వతీ భగవతీ భారతీ నిశ్శేషజాడ్యాపహా.

దక్షిణామూర్తి ప్రార్థన:

ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ్ ఙ్ఞానైకమూర్తయే
నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణా మూర్తయే నమః.

గురవే సర్వ లోకానాం భిషజే భవరోగిణాం
నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః.

భోజనమునకు ముందు:

శ్లో: బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతం
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా .

శ్లో:అన్న పూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణ వల్లభే
ఙాన వైరాగ్య సిధ్యర్థం భిక్షాం దేహీచ పార్వతీ.

శ్లో: అహం వైస్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం.

ఓం నమో నారాయణాయ.

భోజనమునకు తరువాత:

అగస్త్యం కుంభకర్ణం శమ్యం బడబానలం
ఆహారపరిణామార్థం స్మరామి వృకోదరం.

సంధ్యా దీపమునకు:

దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే.

నిద్రకు ఉపక్రమించునపుడు :

అచ్యుతం కేశవం విష్ణుం హరిం సత్యం జనార్దనం
హంసం నారాయణం కృష్ణం జపేద్దుస్వప్న శాంతయే.

రామస్కంధం హనూమంతం వైనతేయం వృకోదరం
శయనేయసి స్మరేన్నిత్యం దుస్వప్నస్తస్య నశ్యతి.

ఇంటి నుండి కార్యార్థులై వెళ్లునపుడు:

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వమంగళా
తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయమంగళం.

లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః
యేషామిందీ వరస్యామో హృదయస్థో జనార్దనః.

ఆపదామప హర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.

ఔషధ సేవనము చేయునపుడు:

ధన్వంత్రిణం గరుత్మంతం ఫణిరాజంచ కౌస్తుభం
అచ్యుతం చామృతం చంద్రం స్మరేదౌషధ కర్మణి.

శరీరే జర్జరీభూతే వ్యాధి గ్రస్తేకళేబరే
ఔషధం జాహ్నవీ తోయం వైద్యో నారాయణో హరిః.