Monday, December 24, 2012

మంత్రాలు తెలుగులో ఎందుకు చదవకూడదు?

 " మంత్రాలు తెలుగులో ఎందుకు చదవకూడదు? " ఈ ప్రశ్న ఏదో ఒక సందర్భంలో ప్రతిఒక్కరికి ఉదయిస్తుంది. ఎందుకు చదవకూడదు అనేదానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రథానమైనవి చర్చిస్తాను.




౧. మంత్రం యొక్క శక్తి మన మాటలకు ఉండదు :   అనుదాత్త ఉదాత్త స్వరితాలతో కూడిన మంత్రములు అపౌరుషేయములు. అవి ఆ పరమేశ్వురుని కృపచే ఋషులకు గోచరమైన ఆయా మంత్రాలకు ఉన్న శక్తి మనం తెలుగులోకి అనువదించుకుని చదవడం వలన రాదు. అంతెందుకు మన చాగంటి వారి మాటలలోని భావాన్ని మన సొంత మాటలలో చెప్పామనుకోండి అంతటి శక్తి ఉంటుందా!? ఉండదు.  భావం ఒకటే అయినప్పటికీ వాడిన పదాల అమరిక, ఉచ్ఛరించే విధానం, దానికి మన అభినయం వీటన్నిటిని బట్టీ ఆయా వాక్యాలు వినేవారిపై ప్రభావం చూపడంలో  చాలా వ్యత్యాసం ఉంటుంది. గురువుగారు, మనం ఇద్దరు చెప్పినదీ తెలుగే! కానీ ప్రభావం వేరు కదా!

 మరి తెలుగులో విన్నదానినే మనం అంతే ప్రభావాన్ని చూపేవిధంగా అనువదించలేకపోతే ఇక పరమేశ్వరని సృష్టి అయిన మంత్రములను ఎంత పెద్ద పండితుడు మాత్రం అనువదించ గలడు చెప్పండి? కనుక మంత్రములకు  ఉన్న శక్తి మనం తెలుగులో చెప్పుకునే భావానికి ఉండనేఉండదు.

౨. సొంతపైత్యం చేరితే అరిష్టమే ఎక్కువ : అనువదించుకోవడంలో మరొక అనర్థమేమంటే తెలుగులోకి మార్చుకోవడంలో  అనువాదకుని సొంత పైత్యం కొంత కలిసిందనుకోండి  ఇక అది అనేక అనర్థాలకు దారితీస్తుంది. వాల్మీకి రామాయణాన్ని ఎందరో ఎన్నో సార్లు తమ బాణిలో రచించారు. తపశ్శక్తి సంపన్నుల రామాయణాల వలన అరిష్టం తక్కువగా ఉన్నప్పటికీ పాండిత్య ప్రకర్షకోసం రచించిన వారి రామాయణాల వలన అనేక అనర్థాలు వచ్చాయి అన్నది మనకు సుస్పష్టం.

౩. మూలం కోల్పోతాము : ఇక అనువాదాల వ్యాప్తి వస్తున్న కొద్దీ అసలైన మూలాన్ని కోల్పోతాము. నాబోటి వారు చక్కగా తెలుగులోనే మంత్రాలు ఉండగా అర్థంకాని ఆసంస్కృతమెందుకు అనుకుంటే ఇక మూలమైన వేదాన్ని పారాయణ చేసేవారెవరుంటారు? భవిష్యత్తులో ఈ అనువాదాలు పెరిగి, అందులో కలిప్రభావంతో ఉన్న వాక్యాలు పెరిగి  గందరగోళం శృష్టిస్తాయి. నిజమైన ఆధ్యాత్మిక ఆసక్తి ఉన్నవారికి మూలం తెలుసుకోవడం చాలా కష్టమౌతుంది.

కనుక మంత్రాలు సంస్కృతంలోనే చదవాలి. స్వరయుక్తంగానే చదవాలి. ఈశ్వరప్రోక్తమైన వేదమంత్రాలు అర్థంకాకపోయినా విననంత మాత్రము చేతనే మనకు అనేక సంపదలను కలుగజేస్తాయనడంలో ఎటువంటి సందేహమూ లేదు.

ఇక స్తోత్రాలు కూడా అంతే! ఎంతో తపశ్శాలులైన వారు రచించినవి కనుక వాటికీ మంత్రములకున్నంత శక్తి ఉన్నది. వాటినికూడా ఆభాషలోనే చదవాలి. అంతెందుకు ఒక కథ చదువుతాము. ఎంతో ప్ర్రేరణ కలిగిస్తుంది. అదే కథని మన మాటలలో మరొకరికి చెప్పామనుకోండి అంతటి ప్రేరణ వారికి కలుగుతుందా! నిస్సంశయంగా కలగదు. ఎందుకంటే ఆకథ రాయడానికి  రచయిత పడినంత అంతర్మథనం మనం పడము కనుక. అతనికి ఉన్న పట్టు మనకు ఆ కథా విషయంపై ఉండదు కనుక. అలాగే మహఋషులు రచిచింన పురాణాలు, స్తోత్రాలు మనం అనువదిస్తే అంతటి శక్తి ప్రేరణ కలుగదు.

ఇక మిగిలింది సంకల్పం, పరిచయం ( ప్రవర ) వంటివి మాతమే! వాటిని ఎలాగైనా చెప్పుకోవచ్చు. కానీ సంస్కృతంలో చెప్పుకుని మనసులో అర్థాన్ని భావనచేయడమే శ్రేయస్కరం. సాధారణంగా బ్రహ్మగారు కూడా సమయాన్ని బట్టి వీలైనంత వివరణ ఇస్తూనే ఉంటారు. ఒకవేళ ఎక్కడైనా మనకు అర్థం కాకపోతే అడిగి తెలుసుకోవడంలో తప్పేమీ లేదు.



ధన్యవాదములు

Saturday, December 15, 2012

నూతన వాహనాలు కొనుట లేదా వాడుట ప్రారంభించుటకు శుభ సమయాలు

దినదిన గండాలతో ప్రయాణించే ఈరోజులలో క్షేమంగా ఇంటికి తిరిగి రావాలంటే, కొన్న వాహనం మీకు అన్నివిధాల కలిసి రావాలంటే తప్పని సరిగా మంచి ముహూర్తము చూసే  నూతనవాహనం తీసుకోవాలి.

అందుకు మంచి తిథి వార నక్షత్రాలు క్రింద న ఇవ్వ బడుతున్నాయి. 

తిధులు : విదియ తదియ పంచమి,సప్తమి, దశమి, శుక్ల ఏకాదశి, శుక్ల త్రయోదశి
వారములు : సోమ, బుధ, గురు, శుక్ర 
నక్షత్రాలు : రోహిణి, పునర్వసు, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, జ్యేష్ఠ, ఉ.షాఢ, శ్రవణం, రేవతి
లగ్నాలు :  వృషభ, మిధున, కర్కాటక, కన్య, తుల, ధనస్సు, మీన  లగ్నాలు మంచివి.
బుధ హోర ప్రశస్థమైనది

పై నక్షత్రాలలో మీకు తారాబలం సరిపోయిన రోజున మిగిలినవి కలిసి ఉండేట్లట్లుగా చూసుకుని నూతన వాహనాన్ని తీసుకోవాలి.
పైన ఇచ్చి న లగ్నాలలో మీకు అష్టమ లగ్నం కాకుండా, అష్టమ శుద్ధి ఉన్న లగ్నాన్ని నిర్ణించుకోవాలి.

తారాబలం చూసుకోవడానికి ఇక్కడ చూడండి

తారాబలము చూచుకొను విధానము


ఈ క్రింది లింకులో PDF ఫైల్ డౌన్ లోడ్ చేసుకోవచ్చును

        http://www.scribd.com/doc/116907811/TARABALAM

Monday, December 10, 2012

మార్గశిర మాస విశిష్ఠ తిథులు - పండుగలు



మార్గశిరమాసం - శుక్లపక్షం : 
పాడ్యమి : గంగాసాన్నం 14/12/12
విదియ :                  
తదియ : ఉమామహేశ్వర వ్రతంఅనంత తృతీయ వ్రతం 15/12/12
చవితి :  వరద చతుర్థినక్త చతుర్థి వినాయకపూజ 16/12
పంచమి :  నాగపంచమి’ నాగపూజ ( స్మృతి కౌస్తుభం ) శ్రీ పంచమి వ్రతం’ ( చతుర్వర్గ చింతామణి) 17/12
షష్ఠి :  సుబ్బారాయుడి  షష్ఠి, స్కందషష్ఠి, చంపాషష్ఠిప్రవార షష్ఠి వ్రతాలు – సుబ్రహ్మణ్య పూజ, రైతుల పండుగ  18/12
సప్తమి : మిత్ర సప్తమి  "ఆదిత్య ఆరాధన( నీలమత పురాణం ) 19/12
అష్టమి : కాలాష్టమీ వ్రతం 20/12  
నవమి :         
దశమి :          
ఏకాదశి : ముక్కోటి ఏకాదశి, మోక్షదైకాదశి, సౌఖ్యదా ఏకాదశి, గీతాజయంతి – ఏకాదశీ ( ఉపవాస) వ్రతం కృష్ణ పూజ, భగవద్గీతా పారాయణ 23/12   

ద్వాదశి :  ద్వాదశీ పారణ, తీర్థదినం, అఖండ ద్వాదశాదిత్య వ్రతం 24/12

త్రయోదశి :  హనుమద్ వ్రతం, అనంగ (మన్మధత్రయోదశీ వ్రతం     25/12
చతుర్దశి :  చాంద్రాయణ వ్రతం ఆరంభ తిథి - రాత్రి వరకు భోజనం చేయకుండా ఉండి గౌరీదేవిని ఆరాధించాలి 26/12
పూర్ణిమ :  కోరల పున్నమి, దత్త జయంతి - చంద్ర ఆరాధన, దత్త చరిత్ర పారాయణం, సాయి సత్చరిత్ర  పారాయణం.  28/12


మార్గశిర మాసం - కృష్ణపక్షం :
పాడ్యమి :  శిలావ్యాప్తి వ్రతం  29/12
విదియ :
తదియ :                  
చవితి :   సంకష్ట హర చతుర్థి 01/01/2013
పంచమి :        
షష్ఠి :            
సప్తమి :  ఫలసప్తమీ వ్రతం 04/01/13
అష్టమి : అనఘాష్టమీ వ్రతంకాలభైరవాష్టమి/ – కాలభైరవపూజ   05/01/13  
నవమి : రూపనవమి వ్రతం   06/01
దశమి :          
ఏకాదశి : సఫల ఏకాదశీ వ్రతం, వైతరణీ వ్రతంధనద వ్రతం 08/01
ద్వాదశి :  మల్లి ద్వాదశి వ్రతంకృష్ణ ద్వాదశీ వ్రతం 09/01
త్రయోదశి : యమత్రయోదశి వ్రతం, మాస శివరాత్రి 10/01
చతుర్దశి :        
అమావాస్య : వకుళామావాస్య, అమావాస్య వ్రతం - ఆవు పాలతో పరమాన్నం వండి దేవునికి నివేదన చేయడం సర్వ శుభస్కరం 11/01/2013
ధనుర్మాసం :    సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశించిన ( 15/12/12, 08.140pm )  నాటి నుండి మకర రాశిలోకి ప్రవేశించే ( 14/01/2013, 06.59am - మకర సంక్రాంతి ) వరకు ధనుర్మాసంగా పిలుస్తారు. సంక్రాంతి నెలపెట్టుట అని కూడా పేర్కొంటారు. సాధారణంగా ప్రతీనెలా 14,15 తేదీలలో సూర్యుడు ఒకరాశినుండి మరో రాశికి ప్రవేశిస్తుంటాడు. మాసంలో "తిరుప్పావై" రోజుకొక్క పాశురం చొప్పున ప్రతి వైష్ణవ ఆలయంలోను చేస్తారు.  గోదా దేవిని ( సాక్షాత్తు లక్ష్మీదేవి )  పూజిస్తారు.  తిరుప్పావై ప్రవచనాలు, ప్రత్యెక పూజలతో వైష్ణవ ఆలయాలు చాల సందడిగా ఉండే మాసం ఇది. ఈ ధనుర్మాసం నెలరోజులూ  కన్నె పిల్లలు తెల్లవారుజ్హామునే లేచి ఇళ్ళముందు కలాపిల్లి చక్కని రంగవల్లులతో,  గొబ్బెమ్మలతో అలంకరిస్తారు.   వీధులన్నీ రంగురంగుల ముగ్గులతో కళ కళ లాడుతూ ఉంటాయి. 

తీర్థ దినం : ఈ భూలోకంలో ఉన్న మూడు కోట్ల తీర్థాలు, మార్గశిర సుద్ధ ద్వాదశి నాడు "అరుణోదయ (సూర్యోదయ)" సమయంలో తిరుమల కొండపై గల స్వామీ పుష్కరిణిలో ప్రవేశించి ఉంటాయని పురాణ ప్రమాణం.  అందుకే,  స్వామి పుష్కరిణి "తీర్థ దినం" గా పూజిస్తారు

మోక్షదా ఏకాదశి : ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి జనన మరణ రహితమైన మోక్షప్రాప్తి కులుగుతుందని చెబుతారు. అందుకే దీనిని మోక్ష ఏకాదశిగా పేర్కొంటారు. ఈరోజు  ఏకాదశీవ్రతం ఆచరిస్తారు. పూర్వం  వైఖానసుడు అని ఒకరాజు ఉండేవాడు. అతనికి ఒకనాడు తన తండ్రి నకరంలో ఉండిపోయి యమయాతనలు పడుతూ ఉన్నట్లు కల వచ్చింది. అందుకు అతను మార్గశిర శుద్ధ ఏకాదశినాడు ఉపవాసం ఉండి నియమాలతో వ్రతం చేశాడు. వ్రత ఫలితంగా అతని తండ్రి స్వర్గలోకానికి చేరాడు. తండ్రికి మోక్షం ఇప్పించిన ఏకాదశి కావడం చేత దీనికి మోక్షదా ఏకాదశిఅని పేరువచ్చింది.
తిథిలన్నింటిలోకీ మార్గశిర శుద్ధ  ఏకాదశికి మరో ప్రత్యేకతా ఉందికురుక్షేత్రంలో తాతలనూ, తండ్రులనూబంధుగణాల్నీ చూసి అస్తస్రన్యాసం చేసిన అర్జునుడికి కృష్ణుడు విశ్వరూప దర్శనమిచ్చి గీత బోధన చేసిందీ రోజేనని పురాణాలు చెబుతున్నాయిఅందుకే  రోజును "గీతాజయంతిగా వ్యవహరిస్తారుఆవేళ కృష్ణుణ్ని  భక్తీ శ్రద్ధ లతో పూజించిగీతా పారాయణ చేయడం నిర్దేసించబడింది.

మనం అందరం మాసంలో చేయవలసిన విధులను ఆచరించి తరించెదము గాక! 

బుధజన విధేయుడు,
రాజశేఖరుని విజయ్ శర్మ