Tuesday, March 22, 2011

పురాణాలు - ఉప పురాణాలు

శ్లో|| మద్వయం భద్వయం చైవ బ్ర త్రయం వ చతుష్టయమ్‌ |
అ - నా - ప - లిం - గ - కూ - స్కాని పురాణాని పృథక్‌ పృథక్‌ ||

1. మత్స్య పురాణం - శ్లోకాల సంఖ్య : 14,000 ('మ' ద్వయం)
2. మార్కండేయ పురాణం - శ్లోకాల సంఖ్య : 9,000
3. భవిష్య పురాణం - శ్లోకాల సంఖ్య : 14,000 ('భ' ద్వయం)
4. భాగవత పురాణం - శ్లోకాల సంఖ్య : 18,000
5. బ్రహ్మ పురాణం - శ్లోకాల సంఖ్య : 10,000 ('బ్ర' త్రయం)
6. బ్రహ్మాండ పురాణం - శ్లోకాల సంఖ్య : 12,000
7. బ్రహ్మ వైవర్త పురాణం - శ్లోకాల సంఖ్య : 18,000
8. వామన పురాణం - శ్లోకాల సంఖ్య : 10,000
9. వాయు పురాణం - శ్లోకాల సంఖ్య : 24,600
10. విష్ణుపురాణం - శ్లోకాల సంఖ్య : 23,000 ('వ'చతుష్టయం)
11. వరాహ పురాణం - శ్లోకాల సంఖ్య : 24,000
12. అగ్ని పురాణం - శ్లోక సంఖ్య : 16,000 - అ
13. నారద పురణం - శ్లోక సంఖ్య : 25,000 - నా
14 పద్మ పురణం - శ్లోక సంఖ్య : 55,000 - ప
15. లింగ పురాణం - శ్లోక సంఖ్య : 11,000 - లిం
16. గరుడ పురాణం - శ్లోక సంఖ్య : 19,000 - గ
17. కూర్మపురాణం - శ్లోక సంఖ్య : 17,000 - కూ
18. స్కాంద పురాణం - శ్లోక సంఖ్య : 81,000 - స్కా 

ఇవికాక - 18 ఉప పురాణాలున్నాయి. అవి :

1. సనత్కుమార పురాణం, 2. సాంబ పురాణం, 3. సౌర పురాణం, 4. నారసింహ పురాణం, 5. నారదీయ పురాణం, 6. వారుణ పురాణం, 7. వాసిష్ఠ పురాణం, 8. కాపిల పురాణం, 9. కాళికా పురాణం, 10. దౌర్వాస పురాణం, 11. ఔశసన పురాణం, 12. ఆదిత్య పురాణం, 13. మాహేశ్వర పురాణం, 14. శివపురాణం, 15. భాగవత పురాణం, 16. పారశర పురాణం, 17. నంది పురాణం, 18. మానవ పురాణం.
 


భక్తి సుధ వారి సైట్ నుండి....

Saturday, March 19, 2011

యుగాదులు - మన్వాదులు

యుగాదులు :
కార్తీక శుద్ధ ద్వాదశి - కృత యుగాది
వైశాఖ శుద్ధ తదియ - త్రేతా యుగాది
మాఘ బహుళ అమావాస్యా - ద్వాపర యుగాది
భాద్రపద బహుళ త్రయోదశీ - కలి యుగాది

 మన్వాదులు :

చైత్ర శుద్ధ తదియ - ఉత్తమ మన్వాది
చైత్ర పౌర్ణమి - రౌచ్యక మన్వాది
జ్యేష్ఠ పౌర్ణమి - భౌచ్యక మన్వాది
ఆషాఢ శుద్ధ దశమి - చాక్షుష మన్వాది
ఆషాఢ బహుళ అష్టమీ - రుద్రసావర్ణిక మన్వాది
శ్రావణ బహుళ అమావాస్య - అగ్ని సావర్ణిక మన్వాది
భాద్రపద శుద్ధ తదియ - తామస మన్వాది
భాద్రపద బహుళ అష్టమీ - సూర్య సావర్ణిక మన్వాది
ఆశ్వయుజ శుద్ధ నవమీ - స్వారోచిష మన్వాది
కార్తీక శుద్ధ ద్వాదశీ - స్వాయంభువ మన్వాది
కార్తీక పౌర్ణమీ - ఇంద్ర సావర్ణిక మన్వాది
పౌష్య శుద్ధ ఏకాదశీ - రైవత మన్వాది
మాఘ శుద్ధ సప్తమీ - వైవస్వత మన్వాది
ఫాల్గుణ పౌర్ణమీ - బ్రహ్మ సావర్ణిక మన్వాది

    ఈ మన్వాదులందు కూడా శ్రాద్ధామును ఆచరించ వలెను. పిండములు లేకుండా- హిరణ్య విధానముగా చేయవచ్చు. ఈ మన్వాదులలో పితృదేవతలకు శ్రాద్ధమును ఆచరించడం వలన రెండువేల సంవత్సరాల కాలం వారు తృప్తి నొందుదురు. శ్రాద్ధమునకు ముందుగానే తిల తర్పణ చేయవలెను.

Wednesday, March 16, 2011

ఆబ్దికాదులను ఆచరిస్తున్నారా? అయితే "ఆబ్దిక శ్రాద్ధవిధి" ని తెలుసుకొనండి.

     నేటి మన జీవనం పరిగెత్తుటకే సరిపోతున్నది. సౌకర్యాలు అనేకం వచ్చాయి. కాలు కదపనవసరం లేకుండా కావలసిన పనులన్నీ చేసుకోగలిగిన ఆధునిక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. కానీ మనకు నిత్యం పరుగే. ఒక్క క్షణం తీరిక ఉండని జీవితం. ఎందుకోసమో ఆరాటం. దేనికోసమో పోరాటం.  ఈ నవ నాగరిక జీవితం మనకు సుఖాన్నిస్తోందా!?  ఏమో ఈ పరుగులలో పొందే సుఖం కూడా ఒక అనుభూతినివ్వలేక పోతోంది.   ఆశ్చర్యకరమైన, అర్థం కాని విషయమేమిటంటే ఎంతగా సౌకర్యాలు పెరుగుతున్నాయో- అంతగా మన జీవితంలో పరుగు పెరిగిపోతున్నది. ఏ సౌకర్యాలు లేని రోజులలో ఒక గ్రామం నుండి మరో గ్రామానికి ప్రయాణం కూడా కష్టమైన రోజులలో మన పూర్వుల జీవనం ఎంతో సాఫీగా, ఎటువంటి తొందరా లేకుండా సవ్యంగా సాగిపోయింది. మనకు నేడు ప్రపంచీకరణ పుణ్యమా అని అమెరికాలో ఉన్న సౌకార్యాలు అనకాపల్లిలోనూ లభ్యమౌతున్నాయి( ధనముంటే ). కానీ మన పూర్వీకులకు ఉన్న ప్రశాంత జీవనం మనకులేదు. ఆప్రశాంతత బయట నుండి వచ్చేది కాదు, అది ఆంతరంగికమైనది. ఎన్ని ఆధునిక సౌలభ్యాలున్నా ఇంకా ఏదో కావాలని తాపత్రయం. అందుకే అశాంతి. ఈ తాపత్రయంలో మన సాంప్రదాయాలను వదిలేస్తున్నాం. మన దేశాన్ని వదిలేస్తున్నాం. మనల్ని మనమే వెలివేస్తున్నాం. అందులో భాగంగా పూజాదికాలను మానివేస్తున్నారు. ఇక ఆబ్దీకాదులను ఎందరు నిర్వహిస్తున్నారు? వాటి ప్రాముఖ్యత ఎంతమంది గుర్తిస్తున్నారు?
   పూర్వం మన వారు ఆబ్దీకానికి అత్యంత శ్రద్ధవహించేవారు. మామూలుగా రోజూ చేసే పూజలో పాటించే మడికంటే ఇంకా కఠినతరమైన మడిని ( శుభ్రతను )  పాఠించేవారు. నేటికీ అది అమలులో ఉంది. అయితే ఈ ఆచారవ్యవహారాలలో నేటి తరానికి అవగాహన అంతగా లేక, చెప్పే వారులేక ఈ ఆబ్దిక విధిలో శ్రద్ధ కరువవుతున్నది. శ్రద్ధతో చేసేదే శ్రాద్ధం అన్నారు. బ్రాహ్మణులలో అయితే భోక్తలను ( బ్రాహ్మణులను ) పిలిచి భోజనం పెట్టడం ఆచారంగా ఉంది. బ్రాహ్మణులు అన్న( అన్నముతో చేసే )శ్రాద్ధమును, మిగతావారు ఆమ ( బియ్యము,పచ్చి కూరలు మొదలైన వానితో ) శ్రాద్ధమును ఆచరించాలి. పూర్వము మేషము ( మేక ) ను, మధువు ( మద్యము) ను పితృదేవతా ప్రీతికొఱకు బ్రాహ్మణులకు సమర్పించేవారు. ఇప్పుడు మేషము బదులుగా మాషములతో( మినుముతో ) చేసిన  గారెలు , మద్యమునకు బదులుగా తేనెను బ్రాహ్మణునికి సమర్పించాలి. కలియుగములో మధుమాంసములు బ్రాహ్మణులు స్వీకరించడం నిషిద్ధం.


   రోజూ పూజచేస్తే పుణ్య బలంతో సుఖములను పొందుతారు. చేయకపోతే పూర్వపాపఫలితాన్ని ఈజన్మలో ఎదుర్కొనలేక అనేక ఇబ్బందులు పడుతారు. అంతే కానీ ప్రత్యేక పాపం రాదు. అయితే ఆబ్దికాదులను నిర్వహించకపోతే పితృదేవతల శాపాన్ని పొందవలసి ఉంటుంది. ఆబ్దికాన్ని నిర్వహించడం ప్రతి గృహస్థుని విధి. మనకి సంవత్సరకాలం, పితృదేవతలకి ఒక రోజు అవుతుంది. వారు రోజూ ఆకలితో పీడింపబడుతూ ఉంటారు.  ప్రతీ సంవత్సరం పితృతిథినాడు ఆబ్దీకమును నిర్వహించి పలు  ( గోవులు, బ్రాహ్మణులు, పక్షులు, అగ్ని హోత్రము, జల చరముల ) రూపాలలో కల వారికి పితృదేవతల నుద్దేశించి భోజనమును సమర్పిస్తాము. అలా ప్రతీసంవత్సరం ఆబ్దీకమును నిర్వహించడం వారికి రోజూ భోజనమును పెట్టడం వంటిది. ఆసమయములో చేసే దాన,ధర్మములు ఊర్ద్వలోకాలలోని పితృదేవతలకు అనంతములై అందుతాయి అని శాస్త్ర వచనం. ఆవిధంగా తృప్తులైన పితృదేవతలు వంశాభివృద్ధి జరగాలని, అక్షయముగా నున్న సిరిసంపదలతో వంశములోని వారు సుఖించాలని దీవిస్తారు. సాధారణముగా పితృశాపం తగిలిన వారికి సంతానముండదు. సంతానం లేకపోవడానికి కల ప్రధాన కారణాలలో ఇది ఒకటి.  ఆర్తితో వారిని ప్రార్థించి, ఈ ప్రత్యాబ్దికాదులను శ్రద్ధతోనిర్వహించడమే దానికి నివారణోపాయం .

 
   చనిపోయిన రోజు ఏ తిథి ఉందో ఆ తిథినే ఆబ్దీకమును ఆచరించాలి. ( పుట్టిన రోజునుకూడా తిథుల ప్రకారం జరుపుకోవాలి ) పెద్దలు చనిపోయిన మొదటి సంవత్సరములో ( ప్రతీ నెలా ఆ తిథినాడు వచ్చే ) పన్నెండు మాసికములను వదలకుండా నిర్వహించాలి. కొందరు తెలియక ఈ నెలలలో కొన్ని వదులుతున్నారు. అది మా ఆచారం అని చెప్తున్నారు. అది సరైన పద్ధతికాదు. తప్పక ఆచరించాలి. మనకు కుదరకపోతే మాకు ఆచారం లేదు అని చెప్పుకోవడం నేడు కనిపిస్తోంది. ఇది కలిప్రభావం తప్ప మరొకటి కాదు.

  పూజాదికాలు కాస్త ఎక్కువగా చేస్తేనే వ్యంగ్యంగా మాట్లాడే జనం మధ్యలో జీవనం సాగిస్తూ - ప్రత్యాబ్దీకమును, పుష్కర శ్రాద్ధాదులను తెలిసో తెలియకో, నమ్మకం ఉండో లేకో నేటికీ  ఇంకా ఆచరిస్తున్న వారున్నారు. అటువంటి వారికి ప్రయోజన కరంగా ఉంటుందని నాదగ్గర కల కీ.శే.లు చల్లా లక్ష్మీ నరసింహ శాస్త్రిగారిచే రచింపబడిన "ఆబ్దికశ్రాద్ధవిధి" అనే పుస్తకమును PDF గా పొందుపరుస్తున్నాను. అది ఆస్తికులకు మరింత ఆసక్తిని, సంగ్ధిగ్ధంలో ఉన్నవారికి కొంత అవగాహనను కలిగిస్తుందని ఆశిస్తున్నాను.  ఇది చాలా వరకు బ్రాహ్మణులు శ్రాద్ధము ఆచరించడానికి గల నియముములను వివరించినను, కొన్ని అందరికీ ఉపయోగపడు నియమములును కలవు. ఎవరికి సంబంధించినవి వారు తెలుసుకొనగలరు.

పుస్తకం కొరకు ఈ క్రింది లింక్ లో చూడండి. 

https://docs.google.com/viewer?a=v&pid=explorer&chrome=true&srcid=0B0Zi3RYt07USMzdmNzc1YWYtYWRlZS00Y2QxLWFmOTgtNWM3MmIwN2I4Y2M2&hl=en