సభాయైనమః
మార్గశిర పూర్ణిమ అనగా 10-12-2011 శనివారం నాడు సా. 06-16 ని.లు నుండి, రా. 09-48 ని.ల వరకు కేతుగ్రస్త సంపూర్ణ చంద్ర గ్రహణము సంభవించును.
మార్గశిర పూర్ణిమ అనగా 10-12-2011 శనివారం నాడు సా. 06-16 ని.లు నుండి, రా. 09-48 ని.ల వరకు కేతుగ్రస్త సంపూర్ణ చంద్ర గ్రహణము సంభవించును.
ఈ గ్రహణం రోహిణి నక్షత్రంలో ప్రారంభమై 15 నిమిషాల తరువాత మృగశిరా నక్షత్రంలో ప్రవేశించి కొనసాగును.
రోహిణీ నక్షత్రం వారికి స్వల్ప దోషము, మృగశిరవారికి అధిక దోషము కలదు. ఈ నక్షత్రముల వారు, వృషభ రాశి వారు దోష నివృత్తి కొరకు గ్రహణ సమయములో చంద్ర, కేతు గ్రహములకు జపములు చేసుకొనుట మంచిది.
మరునాడు ఉదయం వెండితో చేయించిన చంద్ర బింబము, పాము పడగలను శివలింగము పై ఉంచి రుద్రాభిషేకము చేసుకుని
నూతవస్త్రంలో ధాన్యముపోసి వానియందు చంద్రబింబము, పాముపడగ ఉంచి బ్రాహ్మణునకు దానము ఇవ్వాలి. నేతితో కూడిన కంచు పాత్రనుకూడా దానంగా ఇవ్వాలి.
దానం ఇచ్చే టప్పుడు : " మమ జన్మరాశి, జన్మ నక్షత్ర స్థాన చంద్ర గ్రహణ సంభవ వశాత్, సూచిత ఆగామి సర్వారిష్ట ప్రశాంతి పూర్వక, ఏకాదశ స్థాన స్థిత శుభఫలిత ప్రాప్త్యర్థం బింబదానం కరిష్యే." అని సంకల్పం చెప్పుకోవాలి.
" తమోమయ మహభీమ సోమసూర్య విమర్థన
హేమతారా ప్రధానేన మమ శాంతి ప్రదోభవ"
" విదుంతుధ నమస్తుభ్యం సింహికానందనా2చ్యుత
దానేనా2నేన నాగస్య రక్షమాం వేదజాత్భయాత్"
అనే శ్లోకాలు చదువుతూ దానం ఇవ్వాలి.
గ్రహణముల గురించి సవివరముగా ఇంకా రాయవలసి ఉంది. అది రేపు ప్రచురిస్తాను.
సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు
--
భగవత్సేవకుడు
రాజశేఖరుని విజయ్ శర్మ
No comments:
Post a Comment